అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌

0
752

పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య
అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురైన ఓవిద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో విషాదం నింపింది.

వివరాల్లోకి వెళ్తే.. వెదురుకుప్పం మండలం వేణుగోపాల్‌పురం గ్రామానికి చెందిన శశి (17) శ్రీ వేంకటేశ్వర అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతుంది.

ఇటీవల అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శశి యూనివర్శిటీలోని ప్రియదర్శిని హాస్టల్ మొదటి అంతస్తులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తనతో పాటు గదిలో ప్రవల్లిక, వర్ధిని, విష్ణుప్రియలు ఉండగా, అర్ధరాత్రి వరకు చదువుకున్న తోటి విద్యార్థులు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో నిద్ర లేచి చూడడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు హించి కేర్ టేకర్ కుమారికి సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ వీ.రమణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తిరుపతి రూరల్‌ పోలీసులతో పాటు మహిళా ఎస్సై అరుణ ఆధ్వర్యంలో హాస్టల్‌కు చేరుకొని మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here