parliament elections: పద్మారావు గౌడ్ అందరికీ సుపరిచితుడు

0
142

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి
జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌


సికింద్రాబాద్‌, ప్రజానావ:
బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి అందరికి సుపరిచితుడని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు.

బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో పద్మారావు గౌడ్‌ తన క్యాంప్ ఆఫీస్‌లో అన్ని డివిజన్ల బూత్ కమిటీ సభ్యులకు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఎలా అయితే అందరికీ అందుబాటులో ఉన్నానో, ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అభివృద్ధికి తోడ్పాడుతానని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క కార్యకర్త మన ప్రభుత్వం హయంలో హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని కోరారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లై ఓవర్లు, రోడ్లు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.


అనంతరం మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైనికులుగా కదిలి మన పద్మారావు గౌడ్‌ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఒక్కో కార్యకర్త వంద మంది చొప్పున కదిలి గడప గడప కు తిరుగుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here