ఇది రైతన్నల విజయం

0
27

  • బీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేదాకా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
  • కామారెడ్డి, జగిత్యాల మాస్టర్‌ప్లాన్‌ రద్దుపై హర్షం

కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌ రద్దు రైతన్నల విజయమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తికి అభినందలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని బీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేదాకా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటంలో తానూ పాల్గొన్నానని, తనతో పాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిల్ కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదన్నారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంత పాలనతో రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజార్చారని మండిపడ్డారు. కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో శ్రీలంక, పాకిస్తాన్ మాదిరిగా మారే పరిస్థితి వస్తుందని, ఈ సర్కార్ ను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here