మైదానంలోకి పాము

0
38

– మ్యాచ్‌ నిలిపివేసిన అంపైర్లు
కొలంబో: మైదానంలోకి పాము రావడంతో అంపైర్లు కొద్దిసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మామూలుగా తేనెటీగలు, పక్షులు, కుక్కల కారణంగా గతంలో మ్యాచ్‌లకు అంతరాయం వాటిల్లగా, తాజాగా ఈ జాబితాలో పాము కూడా చేరినట్లయింది. నాగిన్‌ మళ్లీ వచ్చిందన్న దినేశ్‌ కార్తీక్‌ లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌) మ్యాచ్‌ను వీక్షించేందుకు ఓ ప్రత్యేక అతిథి మైదానంలోకి రావడం కలకలం సృష్టించిందన్నారు. ఎల్‌పీఎల్‌ నాలుగో సీజన్‌లో భాగంగా సోమవారం గాలె టైటాన్స్‌, దంబుల్లా ఔరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గాలె ప్లేయర్‌ మషకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో మైదానంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. దీంతో మ్యాచ్‌కు ఆటంకం వాటిల్లడంతో అధికారులు దాన్ని బయటకు పంపి, మ్యాచ్‌ను కొనసాగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here