theenmar mallanna:తీన్మార్ మల్లన్నను గెలిపిద్దాం

0
22

తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్

ప్రజా గొంతుక నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై నిత్యం ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చింది.

అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు.. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు.

మెగా డీఎస్సీ వేస్తానని చెప్పిన కేసీఆర్ గ్రూప్-1,2 పరీక్షలు పేపర్ లీకేజీ చేసి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను అమ్ముకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

జీవో 317 తెచ్చి ఉద్యోగులను చిన్నాభిన్నం చేసి వారికి అన్యాయం చేసిన ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఉద్యోగాలు ప్రకటన చేసి నిరుద్యోగులను ఆదుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అన్నారు.

పట్టభద్రుల శాసన మండలికి ప్రజల పక్షాన పోరాడే తీన్మార్ మల్లన్న ను భారీ మెజార్టీతో గెలిపించి చట్టసభల్లో పంపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గుగులోతు లక్ష్మణ్ నాయక్, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు, మాడుగుల జయపాల్, మహమ్మద్ యూసుఫ్ తెలంగాణ ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here