అసెంబ్లీలో పాట పడిన హరీశ్ రావు

0
211

సమైక్య రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి లేడు. వీటిని మరోసారి హరీశ్ రావు అసెంబ్లీలో పాడి వినిపించారు.

కాంగ్రెస్ పాలనలోరన్నో మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో
గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది. కృష్ణమ్మ తల్లిరాకన్నీల్లు రాల్చింది.
సింగరేణి తల్లి సిన్నబోయినాది. సిక్స్ టెన్ జీవోనేమో జీరో అయ్యినాది.
అని కాంగ్రెస్ దుర్మార్గపు దాష్టికాల గురించి ప్రజా యుద్ధనౌక గద్దర్ రాసిన్రు అధ్యక్షా..

ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి
దక్సిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి
నీళ్లు లేక నోళ్లు తెరిచెబీళ్లను చూడు


మా పల్లెలన్నీ బోసిపోగ తల్లడిల్లుతున్న తల్లీ
చూడు తెలంగాణ, చుక్కలేని నీళ్లు లేని దాన
మా గోడు తెలంగాణ, బతుకు పాడైన దాన..
అని అందెశ్రీ కాంగ్రెస్ పాపిష్టి పరిపాలనను శపిస్తూ రాసినారు.

మరో కవి జయరాజు గారు…
వానమ్మవానమ్మఒక్కసారన్నవచ్చిపోవేవానమ్మ
చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కండ్లల్ల నీళ్ళు లేవు.
అని హృదయం ద్రవించి పోయేలా రాసారు.

కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడు, గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడు. ఇట్ల చెప్పుకుంటు పోతే రేపటి దాక చెప్పచ్చు అధ్యక్షా అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here