Bandi Sanjay: వారణాసిలో వార్ వన్ సైడే

0
190
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
  • పాండే హవేలీ, సోనార్ పుర ప్రాంతాల్లో ప్రచారం

జూన్ 1న జరిగే ఆరో దశ ఎన్నికల్లో వారణాసిలో వార్ వన్ సైడే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పోల్ అయ్యే ఓట్లలో అత్యధిక శాతం మోడీకే పడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో బండి సంజయ్ డోర్ టు డోర్ ప్రచారం చేశారు.

అనంతరం పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ వారణాసిలో ఉన్న ప్రతి ఒక్కరూ మోడీ అభిమానులేనని, వారంతా కచ్చితంగా కమలం గుర్తుకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అయితే పోలింగ్ శాతం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. మోడీకి దేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే అత్యధిక పోలింగ్ నమోదు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సోనార్ పురలో మహిళా బృందంతో బండి సంజయ్ భేటీ సందర్భంగా కాశీలోని ప్రతి ఒక్క మహిళ మోడీకే ఓటు వేస్తారని బృందంలోని మహిళలు సంజయ్ కు వివరించారు.

అదే ధీమాతో కూర్చోకుండా ఇంట్లో వాళ్లతో పాటు ఇరుగుపొరుగు వారితోను ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మహిళలదే అని సూచించారు.

శ్రీరామ తారక ఆంధ్రా అశ్రమంలో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వీవీ సుందర శాస్త్రితో భేటీ అయిన బండి సంజయ్ తెలుగు వారి పోలింగ్ నూటికి నూరు శాతం జరిగేలా చూడాలని కోరారు.


సుబ్రహ్మణ్య జోషి, మహేశ్‌బాబు తదితర తెలుగు ప్రముఖులతో సంజయ్ కలిసి మోడీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here