accident: డీసీఎంను ఢీకొట్టిన లారీ

0
52

డీసీఎంను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ బైరిశెట్టి నర్సింహారావు సిరిసిల్ల నుంచి రామగుండం వైపు రాంగ్‌ రూట్‌లో వేగంగా వెళ్తుండగా నాంపల్లి గుట్ట వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న తాటిపల్లి బాపురెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

బాపురెడ్డి సిరిసిల్ల పట్టణం సాయినగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ నాగేంద్రచారి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here