Revanth reddy: అధికార చిహ్నంలో మార్పులు

0
201

ఇప్పటికే తెలంగాణ కోడ్‌ టీఎస్‌ స్థానంలో టీజీని తీసుకొచ్చిన రేవంత్‌ రెడ్డి సర్కార్‌ తాజాగా రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చిత్రాకారులు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి చర్చించి, పలు నమూనాలు పరిశీలించారు.

అయితే తుది నమూనాపై మాత్రం పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చవద్దని పలువురు రాజకీయ నేతలు, మేధావులు ప్రభుత్వానికి విన్నవించినా.. మార్పు చేసేందుకే రేవంత్‌ రెడ్డి మొగ్గుచూపడంపై రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here