– ట్రయల్ రన్ విజయవంతంపై మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ హర్షం
ప్రజానావ/సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 9 లో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయాన్ని మరో 20 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో మే 23 న మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతం కాగా, ఆదివారం ఉదయం రెండో పంపు ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఇదిలాఉంటే రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతంపై మంత్రి కేటీఆర్, కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు.